ETV Bharat / bharat

'అదే నిజమైతే.. 20 మంది ఎందుకు అమరులయ్యారు?'

author img

By

Published : Jun 26, 2020, 3:55 PM IST

Updated : Jun 26, 2020, 4:01 PM IST

గల్వాన్​ వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. సరిహద్దులో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ చెప్పారని.. అదే నిజమైతే 20మంది జవాన్లు ఎందుకు అమరులయ్యారని నిలదీశారు. ఈ విషయంపై ప్రజల విశ్వాసాన్ని మోదీ పొందాలన్నారు.

If China hasn't occupied territory, why were our 20 soldiers martyred, asks Sonia
'అది నిజం కాకపోతే.. ఆ జవాన్లు వీరమరణం ఎలా పొందారు?'

దేశ సరిహద్దుల రక్షణ విషయంలో కేంద్రప్రభుత్వం ఏమాత్రం రాజీపడరాదని ఉద్ఘాటించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత్​-చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.

లద్దాఖ్​లో వీరమణం పొందిన జవాన్ల గౌరవార్థం కాంగ్రెస్​ చేపట్టిన "స్పీక్​ అప్​ ఫర్​ జవాన్స్​" కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు సోనియా. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ అంటున్నారని... అదే నిజమైతే 20 మంది సైనికులు వీరమరణం ఎలా పొందారని ప్రశ్నించారు.

అసలు చొరబాటు జరగలేదని మోదీ అంటున్నారని.. కానీ ఉపగ్రహ చిత్రాలు చూసిన నిపుణులు మాత్రం భారత సరిహద్దులో చైనా దళాలను గుర్తించారని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు. దీని అర్థం చొరబాటేనని తెలిపారు.

"లద్దాఖ్​లో చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పుడు, ఎలా తిరిగి పొందుతుంది? మన సరిహద్దు సమగ్రతను చైనా ఉల్లంఘిస్తోందా? ఈ విషయంపై ప్రజల విశ్వాసాన్ని మోదీ సంపాదించగలుగుతారా?"

---సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని.. అదే నిజమైన దేశభక్తి అవుతుందని అన్నారు సోనియా.

ఇదీ చూడండి:- 'ఇందిరా గాంధీ మనవరాలిని.. భాజపా ప్రతినిధిని కాదు'

దేశ సరిహద్దుల రక్షణ విషయంలో కేంద్రప్రభుత్వం ఏమాత్రం రాజీపడరాదని ఉద్ఘాటించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత్​-చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.

లద్దాఖ్​లో వీరమణం పొందిన జవాన్ల గౌరవార్థం కాంగ్రెస్​ చేపట్టిన "స్పీక్​ అప్​ ఫర్​ జవాన్స్​" కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు సోనియా. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ అంటున్నారని... అదే నిజమైతే 20 మంది సైనికులు వీరమరణం ఎలా పొందారని ప్రశ్నించారు.

అసలు చొరబాటు జరగలేదని మోదీ అంటున్నారని.. కానీ ఉపగ్రహ చిత్రాలు చూసిన నిపుణులు మాత్రం భారత సరిహద్దులో చైనా దళాలను గుర్తించారని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు. దీని అర్థం చొరబాటేనని తెలిపారు.

"లద్దాఖ్​లో చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పుడు, ఎలా తిరిగి పొందుతుంది? మన సరిహద్దు సమగ్రతను చైనా ఉల్లంఘిస్తోందా? ఈ విషయంపై ప్రజల విశ్వాసాన్ని మోదీ సంపాదించగలుగుతారా?"

---సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని.. అదే నిజమైన దేశభక్తి అవుతుందని అన్నారు సోనియా.

ఇదీ చూడండి:- 'ఇందిరా గాంధీ మనవరాలిని.. భాజపా ప్రతినిధిని కాదు'

Last Updated : Jun 26, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.